సియోల్ : ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ఆదివారం ప్రకటించింది. ఉదయం 8 గంటలకు ఉత్తర కొరియా తన భూభాగంలోని సముద్ర జలాల్లోకి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. సింప్నో నౌకాశ్రయానికి సమీపంలోని జలాలపై క్షిపణులను గురించినట్లు చెప్పారు. అయితే క్షిపణుల సంఖ్య, ఎంత దూరం ప్రయాణించాయో, నిర్దిష్ట ప్రయోగ వివరాలను దక్షిణ సైన్యం వివరాలను అందించలేదు.