తెలంగాణ : ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్.రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో వివాహం జరగనున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ” అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం ” అని షర్మిల తెలిపారు.