- 26 మంది సైనికులకు గాయాలు
సియోని : మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కియోలారి పోలీస్ స్టేషన్ ఇన్చార్జి చైన్ సింగ్ ఉయికే మాట్లాడుతూ.. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని-మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ గ్రామ సమీపంలో తెల్లవారుజామున 1 గంటకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కన్హయ్య జస్వానీ (75), నిక్లేష్ జస్వానీ (45), డ్రైవర్ పురుషోత్తం మహౌబియా (37) అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదంలో ఎస్ఏఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడిందని.. దీనితో మొత్తం 26 మంది ఎస్ఏఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపారు. సైనికులకు వెంటనే కియోలారి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తునట్లు తెలిపారు. వీరిలో తీవ్ర గాయాలపాలైన ఒకరిని నాగ్పూర్కు తరలించామని, ఘటనపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. ఘటనపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు.