అమ్మవారి ఆలయం టికెట్‌ కౌంటర్లో పాము.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది

విజయవాడ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గ అమ్మ వారిని ఆరాధించే యాత్రికులు కోట్లల్లో ఉన్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో ఒక్కసారిగా ఓ పాము కలకలం సృష్టించింది. దీనితో అక్కడ పని చేసే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాలలోకి వెళ్తే.. విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయం లోని స్కానింగ్‌ సెంటర్‌ టికెట్‌ కౌంటర్లో పాము దర్శనమించింది. కాగా ఆ పాముని చూడగానే కౌంటర్లో ఉన్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.అనంతరం ఆలయ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. ఈ నేపథ్యంలో పాములు పట్టే వ్యక్తి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ వ్యక్తి పాముని పట్టుకుని కొండ పైన వదులుతానని.. పాములను చంపకూడదని చెప్పారు. అనంతరం ఆ పాముని పట్టుకున్నారు. కాగా ఆ పాము విషం లేని పాము కావడం చేత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా పాములు పెట్టె వ్యక్తి పామును పట్టుకున్నారు. అనంతరం ఆ పాముని ఆలయ ప్రాంగణానికి దూరంగా తీసుకు వెళ్లి కొండ పైన వదిలేశారు. కాగా ఒక్కసారిగా పాముని చూసేసరికి భయాందోళనకు గురయ్యామని.. అయితే కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి చక్కబడిందని ఆలయ సిబ్బంది తెలిపారు

➡️