సేవలు అభినందనీయం

Feb 28,2024 23:26

ప్రజాశక్తి -యద్దనపూడి
స్థానిక డిఆర్డిఎ కార్యాలయం నందు వాలంటీర్లకు అవార్డుల ప్రధానం బుధవారం చేశారు. సభలో వైసిపి ఇంచార్జి యడం బాలాజీ మాట్లాడుతూ వాలంటీర్లు తమ పరిధిలోని ప్రజలకు విలువైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. వావృద్దులు, వికలాంగులకు మంచి సేవ చేస్తున్నారని అన్నారు. మండలానికి సేవా మిత్ర 130, సేవ రత్న 5వచ్చాయి. కార్యక్రమంలో ఎంపిడిఒ శివ సుబ్రహ్మణ్యం, తహశీల్దారు నాగరాజు, ఇఒఆర్డి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్సులు, సర్పంచ్‌లు వెంకటప్పయ్య, రేణుక బాలకోటేశ్వరరావు, జెడ్పిటిసి లక్ష్మి నారాయణమ్మ, ఎంపిటిసిలు సిచ్ కృష్ణయ్య, జంపాని కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️