పోలీస్ హెడ్ క్వార్టర్లో సెమి క్రిస్మస్ వేడుకల

Dec 19,2023 00:41

ప్రజాశక్తి – ఒంగోలు
పోలీసు హెడ్‌ క్వార్టర్లలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మలికాగర్గ్‌ హాజరై సెమి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి, అందరికి క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కార్యాలయంలో ప్రతి ఏడాది సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజైన క్రిస్మస్‌ శాంతి, సంతోషాలకు ప్రేమ, త్యాగనిరతికి చిహ్నమని అన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఒకే సారి రావడం ప్రతి చోటా పండుగ వాతావరణం ఉంటుందని అన్నారు. ఈ ఏడాది మనం చేసిన తప్పులను గుర్తుకు చేసుకొని సవరించుకోవాలని అన్నారు. వచ్చే ఏడాది ఆ తప్పులు జరుగకుండా చూసుకోవాలన్నారు. చదువులో రాణించే విద్యార్థులు కూడా ఈ ఏడాది కంటే రానున్న ఏడాదిలో అత్యధిక మార్కులు సాధించేలా షెడ్యూల్ రూపొందించు కోవాలన్నారు. తాను ప్రతి ఏడాది కూడా గత స్మృతులను గుర్తుకు చేసుకొని, వచ్చే ఏడాదిలో వాటికి అనుగుణంగా విజయాన్ని అందుకుంటున్నట్లు తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పూర్తి ఆరోగ్యవంతులయ్యేందుకు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఎస్పీ స్వయంగా చిన్నారులు తయారు చేసిన పెయింట్, డ్రాయింగ్ గ్రీటింగ్ కార్డులను పరిశీలించి అభినందించి, బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో ఎఆర్‌ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్‌ఒ ఎఒ సులోచన, ఎస్‌బి డిఎస్‌పి మరియదాసు, ఎఆర్‌ డిఎస్‌పి వెంకటేశ్వరరావు, డిసిఆర్‌బి సిఐ భీమా నాయక్, ఐసిసిఆర్ సిఐ దుర్గాప్రసాద్, ఆర్‌ఐలు హరిబాబు, శ్రీహరిరెడ్డి, సీతారామరెడ్డి, శ్రీకాంత్, పాస్టర్ ఎం ప్రసాద్ పాల్గొన్నారు.

➡️