ముద్రగడను కలిసిన వరుపుల

Apr 21,2024 21:59
వైసిపి నేత ముద్రగడ పద్మనాభంను వైసిపి

ప్రజాశక్తి – కిర్లంపూడి

వైసిపి నేత ముద్రగడ పద్మనాభంను వైసిపి ప్రత్తిపాడు నియో జకవర్గ అభ్యర్థి వరుపుల సుబ్బారావు కిర్లంపూడిలో ఆయనను మర్యాదపూ ర్వకంగా కలిశారు. ఆయ నతోపాటు, ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం, ఏలూరు, పెద్దనాపల్లి గ్రామాలకు సంబంధించిన వైసిపి నాయకులు ముద్రగడను కలిశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావును గెలిపించాలని కోరారు. చంద్రబాబు అధికారంలో రావాలని పగటి కలలు కంటున్నారన్నారు. సినీ నటులను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ నా విజయానికి సహకారం అందించాలని ముద్రగడను కోరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్‌ గణేశుల రాంబాబు, గౌతు స్వామి, గణేశుల లచ్చబాబు, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

➡️