- పట్టించుకోని గ్రామపంచాయతీ అధికారులు
ప్రజాశక్తి- వి అర్ పురం: మండలంలోని విఆర్ పురం రాజీవ్ గాంధీ సెంటర్లో గల తాగు నీటి చేతి బోరు నిరుపయోగంగా మారింది. అక్కడే చుట్టూ చెత్త చెదారం ఉండడంతో కనీసం బాటసారులు మంచినీళ్లు తాగడానికి వీలు లేని దుస్థితి ఉందని పలువురు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. సురక్షిత మంచినీరు ఇచ్చే బోరు చుట్టు చెత్త పేరుకుపోయి ఉంది. నీళ్ళు ఇచ్చే బోరు చుట్టూ ఇలా చెత్త ఉన్నా అధికారులు పరిశీలన చేసి, బోర్ వద్ద చెత్తను తొలగించాలని పరిసర వాసులు కోరుతున్నారు.