ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం 123 మంది వలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను అధికారులకు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పంచాయతీ పరిధిలో 50 మంది వలంటర్లు రాజీనామా చేసి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు సమర్పించారు. పాతపట్నం మండలంలో 20 మంది, ఎన్టిఆర్ జిల్లా వత్సవాయిలో 49 మంది, ఇందుగుపల్లి గ్రామానికి చెందిన నలుగురు తమ విధులకు రాజీనామా చేశారు.