- సిఐడికి ఇసి ఆదేశం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డిజి సిఐడి (సైబర్ సెల్)ను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసరు ఎమ్ఎన్ హరీంధర్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడంతోపాటు ఐవిఆర్ కాల్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఎన్నికల కమిషన్కు గతనెల 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొంది.