కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత

Apr 10,2024 17:01 #Cantonment BRS, #nivedhitha

హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కీర్తిశేషులు ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మఅతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. లాస్య నందిత సోదరి నివేదితను బరిలోకి దింపారు.

➡️