ఓటు ప్రాముఖ్యతను గుర్తించండి

Apr 25,2024 22:54
ప్రతీ ఒక్కరూ ఓటు ప్రాధాన్యతను

ప్రజాశక్తి – కాకినాడ

ప్రతీ ఒక్కరూ ఓటు ప్రాధాన్యతను గుర్తించాలని కాకినాడ సిటీ నియోజకవర్గ ఆర్‌ఒ జె.వెంకటరావు సూచించారు. స్థానిక రాజాట్యాంక్‌ పార్కులో ఓటు విలువను తెలియజెప్పడం, ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించడం లక్ష్యంగా సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అహ్లాదం కోసం, వాకింగ్‌ కోసం వచ్చిన ఓటర్లకు ఆర్‌ఒ అవగా హన కల్పించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఓటు వేద్దామనే నినాదంతో ఏర్పాటైన ఈ సెల్ఫీపాయింట్‌ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆర్‌ఒ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగిం చుకోవాలన్నదే ఎన్నికల కమిషన్‌ ప్రధాన లక్ష్యమ న్నారు. ప్రధానంగా యువ ఓటర్లు చైతన్యవంతులై ప్రజాస్వామ్య పరి రక్షణలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో నగరపాలక సంస్థ ఎస్‌ఇ పి.సత్యకుమారి, స్మార్ట్‌సిటీ ఎస్‌ఇ పి.వెంకటరావు, ఇఇ సత్యకుమారిపాల్గొన్నారు.

➡️