రేషన్ బియ్యం పట్టివేత

Jan 4,2024 00:00

ప్రజాశక్తి – కారంచేడు
స్థానిక 14వ వార్డులో ఉన్న మూడో నెంబర్ షాపు వద్ద అక్రమంగా నిలవచేసిన 25క్వింటాళ్ల రేషన్ బియ్యంను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. షాపు నుండి రేషన్ పంపిణీ వాహనానికి ప్రతిరోజు బియ్యం సప్లై చేస్తూ ఉన్నట్లు ఉందని, అయితే వాహనదారుడు లబ్ధిదారులకు ఇవ్వకుండా బియ్యాన్ని అక్రమంగా నిలవజేసినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఉన్న స్టాక్ పాయింట్‌ను, వాహనదారులను విచారించారు. 25టన్నుల బియ్యం ఉన్నట్లుగా నిర్ధారణ చేసి రేషన్ డీలర్‌పై, వాహనదారునిపై 6ఎ కేసు నమోదు చేసినట్లుగా సివిల్ సప్లై అధికారులు తెలిపారు. అలాగే రేషన్ పంపిణీ వాహనాన్ని, బియ్యం నిల్వచేసిన ఇంటిని సీజ్ చేసినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దారులు ఓంకార్, కిషోర్, అనిత పాల్గొన్నారు.

➡️