సజ్జన్‌ జిందాల్‌పై అత్యాచారం కేసు

Dec 18,2023 10:22 #against, #rape case, #Sajjan Jindal

ముంబయి : ప్రముఖ పారిశ్రామిక వేత్త, జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌, ఎమ్‌డి సజ్జన్‌ జిందాల్‌పై అత్యాచార ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 30 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 13న కేసు నమోదు చేసినట్లు, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం 2021 అక్టోబర్‌ 8న దుబారులో ఒక ఐపిఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా బాధిత మహిళ తొలిసారిగా జిందాల్‌ను కలిశారు. ఆ తరువాత ఫోన్‌లో మాట్లాడుకోవడం, వ్యక్తిగతంగా కలుసుకోవడం చేసేవారు. వివాహం చేసుకుంటానని జిందాల్‌ హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. 2022 జనవరిలో బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ప్రధాన కార్యాలయం పెంట్‌హౌస్‌లో తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు నిర్లక్ష్యం వహించడంతో హైకోర్టును ఆశ్రయించానని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలతో జిందాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 64 ఏళ్ల జిందాల్‌ జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు నేతృత్వం వహించడంతోపాటు ఉక్కు, విద్యుత్‌, మౌలిక వసతులు, సిమెంట్‌, పెయింట్స్‌, ఇ-కామర్స్‌, స్పోర్ట్స్‌ వంటి విభిన్న రంగాల వ్యాపారాల్లో ఉన్నారు.

➡️