నేటికీ వదలని వర్షపునీరు

Dec 14,2023 00:26

ప్రజాశక్తి – భట్టిప్రోలు (వేమూరు)
వేమూరు మండలం చావలి, పెరవలి కాలింగ్ గ్రామాల్లో నేటికీ వర్షపు నీరు తగ్గలేదు. వరి పంట నీటిలోనే కుళ్ళిపోతూ ఉండటంతో రైతులు ఆందోళనకు గురివుతున్నారు. ఎఒ సిహెచ్ సునీత నీళ్లలో ఉన్న వరి మాగాణిని పరిశీలించారు. నీటిలో ఉన్న ప్రతి పంటను నమోదు చేసి పరిహారం అదే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చారు. రైతులు తమ వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుతో నమోదు టీంకు అందించి దగ్గరుండి నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ క్రాఫ్ట్ చేసుకున్న రైతులకు చెప్పారు. ఈమె వెంట వ్యవసాయ సిబ్బంది, రైతుల ఉన్నారు.

➡️