న్యూఢిల్లీ : తాను కేవలం రూ.20 కోట్ల ఆస్థులను మాత్రమే కలిగి ఉన్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అఫిడవిట్లో ప్రకటించారు. వయనాడ్ లోక్సభ స్థానం కోసం బుధవారం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించిన సంగతి తెలిసిందే. చరాస్తుల విలువ రూ.9 కోట్లు కాగా, స్వయంగా ఆర్జించిన స్థిరాస్తుల కొనుగోలు ధర రూ. 7 కోట్లుగా ప్రకటించారు. స్వయంగా సంపాదించిన చరాస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.9కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ రూ. 2కోట్లుగా తెలిపారు. అలాగే 49 లక్షల రూపాయల అప్పు ఉండగా, ప్రస్తుతం నగదు రూ. 55,000 ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు.
కాగా, గత ఎన్నికల్లో మొత్తం ఆస్తుల విలువ రూ.15 కోట్లుగా ప్రకటించగా, 2014లో రూ.9.4 కోట్లుగా పేర్కొన్నారు.