ప్రజాశక్తి – కురుపాం : వైద్య సిబ్బంది ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఎం.నారాయణ అన్నారు. మండలంలోని మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల రోగుల వివరాలు అందిస్తున్న సేవలపై వైద్యాధికారి బి.ప్రజ్ఞను అడిగి తెలుసుకొని ల్యాబ్ గదిని సందర్శించారు. అనంతరం రోగులకు అందించాల్సిన వైద్యంపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.