పదోన్నతి అభినందన సన్మాన సభ

Nov 23,2023 00:21

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
రేపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న పి శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా కనిగిరి అసిస్టెంట్ కన్సర్వేటర్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా మండలంలోని ముత్తాయిపాలెం నర్సరీ నందు బుధవారం ఆయనకు అభినందన సన్మాన సభ నిర్వహించారు. రేపల్లె ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా గోల్డ్ మెడల్ పొందారని డిఎఫ్‌ఎ ఒ భీమయ్య అన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. శ్రీనివాసరావును దుశ్యాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రేపల్లె ఇంచార్జ్ ఎఫ్అర్ఓ వివి రమణారావు, బాపట్ల డెప్యూటీ అర్ఓ బాలకృష్ణ, అటవీ సిబ్బంది, బాపట్ల డివిజన్ టింబర్, సామిల్ యజమానులు పాల్గొన్నారు.

➡️