- ఫైనల్లో హర్యానా స్టీలర్స్పై గెలుపు
- ముగిసిన ప్రొ కబడ్డీ సీజన్-10 పోటీలు
హైదరాబాద్: ప్రొ కబడ్డీ సీజన్-10 టైటిల్ను పుణేరి పల్టన్స్ తొలిసారి కైవసం చేసుకుంది. గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో పుణేరి జట్టు 28-25పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్పై విజయం సాధించింది. పుణేరి కెప్టెన్ అస్లామ్ ముస్తఫా(4పాయింట్లు) ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చగా.. పంకజ్ మోహిత్(9పా) , మోహిత్ గోయట్(5) రైడ్లో సత్తా చాటారు. ఇక గౌరవ్ ఖత్రి(4) ట్యాకిల్స్లో రాణించాడు. హర్యానా జట్టులో శివమ్(6)రైడ్లో సత్తా చాటగా.. వినయ్(3), ఆశీశ్(2) ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచారు. పుణేరి జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చగా.. హర్యానా జట్టు ట్యాకిల్స్లో ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది.
ప్రైజ్మనీ.. విజేత(పుణేరి పల్టన్స్) : రూ.3కోట్లు
రన్నరప్(హర్యానా స్టీలర్స్): రూ.1.80కోట్లు
3, 4స్థానాలు : రూ.90లక్షలు(ఒక్కో జట్టుకు)
5, 6 స్థానాలు : రూ.45లక్షలు(ఒక్కో జట్టుకు)