టెక్కలిలో ‘సిద్ధం’ ముగింపు సభ

ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌

నేడు సిఎం జగన్‌ పర్యటన

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను టెక్కలిలో ముగిస్తారు. ఆయన మంగళవారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. ఎచ్చెర్లలోని అక్కివలసలో రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు బస్సు యాత్రను ప్రారంభం కానుంది. రోడ్‌షోగా ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్‌, పల్లివలస, నరసన్నపేట క్రాస్‌రోడ్డు, గట్లపాడు, వాండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాళి మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు టెక్కలి మండలం పరశురాంపురం కూడలికి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు పరశురాంపురం కూడలి నుంచి బయలుదేరి కె.కొత్తూరు మీదుగా అక్కవరం చేరుకుంటారు. అక్కడితో ఆయన బస్సు యాత్రను ముగిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభాస్థలికి 4.20 గంటలకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 5.20 గంటలకు అక్కవరం సభాస్థలి నుంచి తిరిగి బయలుదేరి 5.25 గంటలకు హెలీపాడ్‌ వద్దకు చేరుకుంటారు. 5.30 గంటలకు హెలీకాప్టరులో బయలుదేరి 6.15 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి 6.30 గంటలకు విజయవాడ వెళ్తారు.

➡️