గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి

Feb 10,2024 16:14 #Konaseema
Pregnant women should take care of their health

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండపేటకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డా.కె. కన్యాకుమారి అన్నారు . ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కపిలేశ్వరపురం మండలంలోని అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనిళవారం వైద్యాధికారులు డా పి ఎన్ ఎస్ డి రత్నకుమారి డా. జివి గీతాంజలి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మండపేట గైనకాలజిస్ట్ డా. కన్యాకుమారి 73 మంది గర్భిణీ స్త్రీలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో హైరిస్క్ గర్భిణీ స్త్రీలను 15 మందిని గుర్తించి ప్రత్యేక వైద్య సేవలు, లేబరేటరీ పరీక్షలు జరిపి వారికి మందులను అందజేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు, గర్భిణీలు తీసుకోవలసిన పౌష్టికాహారం, ఆసుపత్రిలో ప్రసవాల ప్రాముఖ్యత, ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను హెల్త్ ఎడ్యుకేటర్ బి రామారావు , ఎం పి హెచ్ ఈ ఓ జె మల్లికార్జునుడు వివరించారు. వైద్య పరీక్షలకు హాజరైన గర్భిణీలకు అంగరకు చెందిన బలుసు రుద్ర మూర్తి ఏర్పాటు చేసిన పలు రకాల పండ్లు, బ్రెడ్స్, బిస్కెట్, అందజేశారు. కార్యక్రమంలో డా గీతాంజలి, డా రత్నకుమారి ఎంపిహెచ్ ఈ ఓ జె మల్లికార్జునుడు, ఎడ్యుకేటెడ్ బి రామారావు, ఏఎన్ఎంలు, వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు.

➡️