గర్భిణీ మహిళ రీ పోస్టుమార్టం

Dec 24,2023 00:00

ప్రజాశక్తి – అద్దంకి
మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ మర్సీరాణి మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించారు. చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన మెర్సీ రాణి అనే మహిళను సెప్టెంబర్ నెల్లో ప్రసవం కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి బంధువులు తీసుకువెళ్లారు. మహిళ ప్రసవం సమయంలో మృతి చెందింది. అయితే మహిళ మృతి చెందటానికి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన ఆదేశాల మేరకు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్నెంట్ డాక్టర్ వాహెలా చౌదరిపై కేసు నమోదయింది. మృతదేహానికి మరలా పోస్టుమార్టం చేయాలని బంధువుల ఫిర్యాదుపై కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో మృతదేహాన్ని వెలికి తీసి అధికారుల సమక్షంలో శనివారం పోస్ట్ మార్టం చేశారు.

➡️