గౌహతి ట్రైన్‌లో గర్భిణీ ప్రసవం

Apr 16,2024 23:11
బెంగళూరు నుంచి కృష్ణగంజి వెళుతున్న

ప్రజాశక్తి – కోటనందూరు

బెంగళూరు నుంచి కృష్ణగంజి వెళుతున్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో మంగళవారం నిండు గర్భిణీ ప్రసవించి ఆడబిడ్డకు జన్మ నిచ్చిందని తుని రైల్వే ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ మహరూపు తెలిపారు. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో అస్సాం రాష్ట్రానికి చెందిన సాహనువాస్‌ తన భార్య ఇషా ఫర్వీన్‌ కలిపి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుని సమీపంలోకి వచ్చే సమ యానికి ఒక్కసారిగా పురిటి నొప్పులు రావడం తో ఆందోళన చెందని భర్త రైల్వే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 139 కు ఫోన్‌ చేశారని, ఇంతలో ట్రైన్‌లో ఉన్న తోటి మహిళలు సహకారంతో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. అప్పటికే రైల్వే పోలీసులు తుని రైల్వే స్టేషన్‌లో 108 వాహనాన్ని సిద్ధం చేశారని, స్టేషన్‌కు ట్రైన్‌ రాగానే తల్లీబిడ్డలను తుని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

➡️