క్వార్టర్స్‌కు ప్రణయ్ సాత్విక్‌-చిరాగ్‌శెట్టి జంట కూడా

Nov 23,2023 22:20 #Sports

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

హాంగ్జౌ: చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు, పురుషుల డబుల్స్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో ప్రణయ్ 21-12, 21-19తో జహన్సెన్‌(డెన్మార్క్‌)పై వరుససెట్లలో నెగ్గాడు. ఈ మ్యాచ్‌ను ప్రణయ్ కేవలం 40నిమిషాల్లోనే ముగించాడు. ఇక పురుషుల డబుల్స్‌లో చిరాగ్‌శెట్టిాసాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి జోడీ 21-15, 21-16తో జపాన్‌కు చెందిన కోగాాసైటోలపై గెలిచారు. ఈ మ్యాచ్‌ను భారత ద్వయం కేవలం 46నిమిషాల్లోనే ముగించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లే లక్ష్యంగా ఈ టోర్నీలో భారత షట్లర్లు బరిలోకి దిగినా.. శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలైన సంగత తెలిసిందే.

➡️