సముద్రంలో కలుషిత జలాలు – తీరంలో తాబేలు మృతి

Jan 2,2024 13:17 #death, #Polluted waters, #sea, #Tortoise

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి (కాకినాడ) : ఉప్పాడ సముద్ర తీరంలో తాబేళ్లు మృతి చెందుతున్నాయి ఇటీవల కొద్దిరోజుల నుండి సముద్రంలో ఉండే పెద్ద తాబేలు మృతి చెందడంతో మత్స్యకార పెద్దలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మత్స్యకారులు ప్రజాశక్తితో మాట్లాడుతూ … సముద్ర జలాల్లో కలుషిత జలాలు కలవడంతో తాబేళ్లు మృతి చెందుతున్నాయని తెలిపారు మత్స్య సంపద అంతరించేపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. సముద్రంలో కలుషిత జలాలు కలుస్తుండటంతో ఎంతో ఇష్టంగా తినే చేపలను ఇప్పుడు ప్రజలు కొనుగోలు చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో కలుషిత జలాలు కలవకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.

➡️