మల్లన్న దర్శనానికి పోటెత్తిన యాత్రికులు

Apr 9,2024 12:06 #mallanna jathara, #sreesailam

శ్రీశైలం : ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే ఆలయాల్లో పూజలు చేశారు.
యాత్రికుల రద్దీ దఅష్ట్యా అలంకార దర్శనానికి మాత్రమే యాత్రికులను అనుమతిస్తున్నారు. కాగా, మల్లన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నది. యాత్రికుల రద్దీతో శ్రీశైలంలోని పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శివ నామస్మరణతో శ్రీశైల గిరులు మార్మోగిపోతున్నాయి.

➡️