తెలంగాణ : తెలంగాణలో ప్రకంపనలు సఅష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ ….
విచ్చలవిడిగా ఫోన్ట్యాపింగ్లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తోపాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల పాత్రను దర్యాప్తు అధికారులు గుర్తించారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బఅందం నిమగమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబిలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. శనివారం అర్థరాత్రి ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆదివారం ఉదయమే వారిద్దరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు.
దేశం దాటిన ముగ్గురి కోసం లుక్అవుట్ సర్క్యులర్ జారీ…
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు నిర్థారణ కావడంతో అధికారులు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ప్రభాకర్ రావు అమెరికా, రాధాకిషన్ లండన్, శ్రవణ్రావు నైజిరియాలో ఉన్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు విచారణకు రావాలని గతంలో ఎస్ఐబిలో పనిచేసిన తొమ్మిది మందికి అధికారులు నోటీసులిచ్చారు. ప్రణీత్రావు ఫోన్ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం అభిప్రాయపడుతోంది.