17న జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని జయప్రదం చేయండి

Dec 15,2023 11:08 #Vizianagaram
pensioners day

పెన్సనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు
మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : 17వ తేదీన జరిగే జాతీయ పెన్సనర్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పెన్సనర్సే అసోసియేషన్ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పెన్సనర్సు అసోసియేషన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న దినంగా ఆరోజు ను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పెన్నర్సుకు పండగ రోజు అయిన ఆ రోజున పెన్నార్సు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు హాజరు కానున్నారని తెలిపారు.అదే విధంగా ఆరోజు డెంటల్, ఐ మెడికల్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పెన్నర్సు అందరూ ఉదయం 10 గంటలకు ప్రార్భమయ్యే కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో నాయకులు నారాయణరావు, నాయుడు, రాజు పెన్సనర్లు పాల్గొన్నారు.

➡️