గాజాలో శుక్రవారం విషాద ఘటన చోటు చేసుకుంది. షాతి శరణార్ధి శిబిరానికి సమీపంలో ప్రజలకు ఆహారం అందించేందుకు అమెరికా పంపించిన పారాచూట్లు ప్రమాదానికి గురయ్యాయి. ఎయిర్డ్రాప్ తెరవడంలో సమస్య ఏర్పడి, పారాచూట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో ఆహారం ప్యాకెట్లు ఆకాశం నుంచి పడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. దీనిని గాజా ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. గాయపడిన వారిని ఆల్-షిఫా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పాలస్తీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్డ్రాప్ ఆకలి సమస్యకు పరిష్కారం కాదని.. ఇది పనికిరాని చర్య అంటూ మండిపడింది. ఎయిర్డ్రాప్ ప్రమాదానికి దారి తీస్తుందని తెలిపింది.