పంజాగుట్ట సిఐ దుర్గారావు అరెస్ట్‌..!

Feb 5,2024 11:59 #arrested, #CI, #Panjagutta

పంజాగుట్ట (హైదరాబాద్‌) : హైదరాబాద్‌ పంజాగుట్ట సిఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలంగాణ ప్రజాభవన్‌ వద్ద బారికేడ్‌ కొట్టిన కేసులో బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ తప్పించుకున్న కేసులో సిఐ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పంజాగుట్టలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంతా సిపికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే సస్పెన్షన్‌ తర్వాత సిఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో సిఐ దుర్గారావును అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎపిలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సిఐ దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు.

ప్రధాన నిందితుడు పారిపోయేందుకు సహకరించిన సిఐ దుర్గారావు

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ వద్ద రోడ్డు ప్రమాదం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో దుర్గారావు నిందితుడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు పారిపోయేందుకు దుర్గారావు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సిఐ దుర్గారావును హైదరాబాద్‌ సిపి కొత్తకోట శ్రీనివాస్‌ సస్పెండ్‌ చేశారు. ఇదే కేసులో బోదన్‌ సిఐ ప్రేముకుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ్‌ కుమార్‌ షకీల్‌ కొడుకు బలవంతంగా విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. దుర్గారావును సస్పెండ్‌ చేసిన అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. ఎట్టకేలకు దుర్గారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితుడికి బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు..!

బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద షకీల్‌ కుమారుడు సోహెల్‌ కారును అతివేగంతో అతివేగంగా నడుపుతూ బారికేడ్లను ఢకొీట్టాడు. పంజాగుట్‌ సిఐ సోహెల్‌కు బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన పోలీసు అధికారులు సిఐని సస్పెండ్‌ చేశారు. సెక్షన్‌ 17 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఒకరి మరణానికి కూడా సోహెల్‌ కారణమని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్‌ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సోహెల్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. బేగంపేట ప్రజాభవన్‌లో సోహెల్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కేసులో పోలీసులకు చిక్కారు.

➡️