జనసేనతో మా పొత్తు ఉంది : పురందేశ్వరి

Dec 16,2023 13:41 #JanaSena, #Purandeshwari, #speech

ఏలూరు : జనసేనతో తమ పొత్తు ఉందని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. శనివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పురందేశ్వరి పర్యటించారు. అనంతరం దండమూడిలో జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు జనసేన ఎక్కడా చెప్పలేదన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసక పాలన చూస్తున్నామన్నారు. ఆడుదాం ఆంధ్రా కాదు. వైసిపి నేతలు ఆంధ్రతో ఆడుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. ప్రతి పైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేది వైసిపి ఆలోచన అని పురందేశ్వరి విమర్శించారు.

➡️