-రక్షణ కల్పించాలని సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్
ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో :మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మంగళవారం హైదరాబాద్లోని సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ప్రొటెక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి, జగన్ సమీప బంధువులు అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కుమారుడు చైతన్య రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. రక్షణ కల్పించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎంపి అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కూడా హైకోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు. కాగా, దస్తగిరి అప్రూవర్ పిటిషన్పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తనను ఈ కేసులో ముద్దాయిగా కాకుండా సాక్షిగా పరిగణించాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై తీర్పును సిబిఐ కోర్టు రిజర్వ్ చేసింది.