అత్యంత విజయవంతమైన ప్రధాని మోడి : ముకేష్‌ అంబానీ

Jan 10,2024 21:10 #Business

గాంధీనగర్‌ : భారత దేశ చరిత్రలోనే నరేంద్ర మోడి అత్యంత విజయవంతమైన ప్రధానిగా నిలువనున్నారని ముకేష్‌ అంబానీ అన్నారు. వైబ్రెంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌లో అంబానీ మాట్లాడుతూ.. ఈ తరంలో ప్రపంచంలోనే గొప్ప నాయకుడని ప్రశంసించారు. భారత ప్రధాని తన పట్టుదల, సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారన్నారు. గుజరాత్‌లోని హజీరాలో దేశంలోనే తొలి ప్రపంచ స్థాయి కార్బన్‌ ఫైబర్‌ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గడిచిన పదేళ్లలో దేశ వ్యాప్తంగా రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను చేపట్టామన్నారు. దీంట్లో మూడో వంతు గుజరాత్‌లోనే వెచ్చించినట్లు వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ 35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. దీన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. ఒక్క గుజరాత్‌ రాష్ట్రమే మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేశారు.

➡️