న్యూఢిల్లీ : మాజీ మోడల్ దివ్య పహుజా గతవారం గుర్గావ్ హోటల్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహం హర్యానాలోని ఓ కాలువలో లభ్యమైనట్లు గురుగ్రామ్ పోలీసులు శనివారం తెలిపారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని తోహ్నాలోని భాక్రా కాలువ అనుబంధ కాలువ నుంచి గురుగ్రామ్ పోలీసుల బృందం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఫొటోల ఆధారంగా పహుజా కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
కాగా, జనవరి 1వ తేదీ పహుజా చనిపోయింది. ఆమె మృతదేహాన్ని జనవరి 2వ తేదీన పంజాబ్లోని భాక్రా కాలువలో పడేశారని గుర్గావ్ సీనియర్ పోలీసు అధికారి ముఖేష్ కుమార్ తెలిపారు. ఆమె శరీరంపై ఉన్న టాటూల ద్వారా ఆమె మృతదేహాన్ని గుర్తించామని కుమార్ తెలిపారు. ఈ హత్య కేసులో బాల్రాజ్ గిల్ అనే నిందితుడిని కోల్కతాలోని విమానాశ్రయంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. గురుగ్రామ్కు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటియాలోని కాలువలో మృతదేహాన్ని పడేసినట్లు పోలీసుల విచారణలో బాల్రాజ్ చెప్పాడు.
గుర్గావ్ హోటల్ యజమాని అభిజిత్ సింగ్ అసభ్యకర వీడియోలు పహుజా ఫోన్ ఉన్నాయి. వాటిని డిలీట్ చేయమని అభిజిత్ సింగ్ కోరినా.. ఆమె తిరస్కరించింది. దీంతో జనవరి 1వ తేదీన పహుజా బస చేసిన హోటల్ రూమ్లోకి ఇద్దరు వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు. అయితే ఈ ఆరోపణల్ని పహుజా కుటుంబం ఖండించింది. గురుగ్రామ్ గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీపై 2016లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో పహుజా, ఆమె బారు ఫ్రెండ్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో జైలులో ఉన్నారు. గతేడాది జూన్లో ఆమె బెయిల్ మంజూరైంది. ఆమెకు బెయిల్ లభ్యమైన కొన్ని నెలల వ్యవధిలోనే హత్యకు గురికావడం గమనార్హం.