ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లక్ష్మీ నగర్ కు చెందిన మైనర్ బాలిక శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ప్రయివేట్ స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది. బాలిక తల్లి ఆశ వర్కర్ గా పనిచేస్తోంది. బాలికను యథాతథంగా గురువారం ఉదయం స్కూలుకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే తెల్లవారుజామున ఉరి వేసుకుని మృతి చెంది ఉండడానికి కుటుంబ సభ్యులు కనుగొన్నారు. దీంతో బాలిక తండ్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నరసాపురం డిఎస్పి మనోహరాచారి ప్రభుత్వాసుపత్రికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలిక ఎందుకు చనిపోయింది కారణాలు ఇంకా తెలియ రాలేదు అన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.