హార్సీలీహిల్స్ కు విచ్చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

Nov 24,2023 12:19 #Annamayya district

ప్రజాశక్తి – బి.కొత్తకోట : మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురువారం రాత్రి బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్ కు విచ్చేశారు. అల్పాహారం తర్వాత కొండపై విస్తృతంగా పర్యటించి, ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన గవర్నర్ బంగ్లా వి పాయింట్ గాలిబండ ఫారెస్ట్ బంగ్లాను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన హార్సీలీహిల్స్ ప్రకృతి రమణీయంగా ఉందని, ఇక్కడ అందాలు తనని మంత్రముగ్దుడిని చేశాయని కితాబునిచ్చారు. అనంతరం ఆయన హార్సీలీహిల్స్ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. తహశీల్దార్ రఫీక్ అహ్మద్, ఎస్ఐ రామ్మోహన, పోలీసులు, తహశీల్దార్ సిబ్బంది వీఆర్వోలు ఉన్నారు.

➡️