– సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం : సిఐటియు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :తమ సమస్యలు పరిష్కరించాలని 52 రోజులుగా ఆందోళన చేస్తున్నా మిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో విజయనగరంలోని మిమ్స్ హెల్త్కేర్ సెంటర్ వద్ద ఉద్యోగులు శుక్రవారం నిరసన తెలిపారు. విధులకు వచ్చిన వైద్యులను అడ్డుకొని ఆస్పత్రి లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, నాయకులు టివి రమణ మాట్లాడుతూ మిమ్స్ ఉద్యోగులకు వేతన ఒప్పందం చేయాలని, బకాయి డిఎలను ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారంపై యాజమన్యాం చర్చలకు పిలవకుండా ఉద్యోగులను బెదిరించడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. వెంటనే యాజమ్యనం స్పందించి చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.