క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీట్

Jan 15,2024 00:43

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
స్థానిక బిఇసి క్రికెట్ గ్రౌండ్ నందు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెటర్నన్ క్రికెట్ మీట్ ఆదివారం నిర్వహించారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మానం నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు గత ఎనిమిది సంవత్సరాలుగా మీట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఎక్కువగా వెటరన్ యువ క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. క్రీడల్లో సీనియర్ క్రికెటర్లైన బందా బాబు, మదన్, విజయుడు, మహేష్, దొప్పలపూడి రామ్మోహన్, కె రఘునాథ్, వై నరేష్ బాబు, కె సత్తిపండు, బక్క రోశయ్య, గంట అంజిబాబు, సురేష్ వర్మ, జానీ, నరేంద్ర, కరీమ్, స్టాన్లీ పాల్గొన్నారు. విజేతలకు మున్సిపల్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ లేళ్ల రాంబాబు జ్ఞాపకార్థం ఆయన సోదరుడు లేళ్ల నరేంద్ర జ్ఞాపికలను బహుకరించారు.

➡️