ఏటుకూరు వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైసిపి నేతలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సిఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు రానుంది. ఉదయం మధ్యాహ్నం 2 గంటలకు సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల నుంచి బయలుదేరి కొర్రపాడు, పేరేచర్ల జంక్షన్, హౌసింగ్ బోర్డు, నల్లపాడు, చుట్టుగుంట మీదుగా ఏటుకూరు వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని తిరిగి సాయంత్రం 6 గంటలకు బుడంపాడు బైపాస్ మీదుగా తక్కెళ్లపాడు, వెంగళరావు నగర్, పెదకాకాని బైపాస్ మీదుగా నంబూరు బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ రాత్రి కి బస చేసి శనివారం మధ్యాహ్నం మంగళగిరి మీదుగా విజయవాడ వెళ్తారు. గుంటూరులోని ఏటుకూరు వద్ద సిఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి విడదల రజని, ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, వైసిపి గుంటూరు లోక్సభ అభ్యర్థి కిలారు రోశయ్య, అసెంబీ అభ్యర్థులు మేకతోటి సుచరిత, నూరిఫాతిమా, బాలసాని కిరణ్, మురుగుడు లావణ్య, అంబటి మురళీకృష్ణ, వైసిపి జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పరిశీలించారు. గుంటూరు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణపై దృష్టి సారించారు.