ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా):గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో వివాహిత దారుణ హత్యకు గురయ్యారు. వివస్త్రను చేసి గొంతుకోసి హతమార్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. టూటౌన్ సిఐ సుధాకర్ తెలిపిన వివరాల మేరకు… పట్టణంలోని గంగానమ్మపేట భవనంవారి వీధికి చెందిన రామిశెట్టి రమేష్, అలేఖ్య దంపతులు. గురువారం తెల్లవారుజామున అలేఖ్య (35) హత్యకు గురయ్యారు. భార్య రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉరడడాన్ని గమనించిన భర్త..వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలికి చెందిన అన్నం శ్రీనివాస్ కొంతకాలంగా తన భార్యను వేధిస్తున్నాడని, గతంలో కూడా గొడవలు జరిగాయని, కేసు విచారణలో ఉందని పోలీసులకు రమేష్ వెల్లడించారు. అతడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఆరోపించారు. అలేఖ్యను శ్రీనివాసే హత్య చేశాడా? మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులను గాలించేందుకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని సిఐ తెలిపారు.