పోలియో చుక్కలు విధిగా వేయించి రేపటి తరం భవిష్యత్తును కాపాడాలి: కమిషనర్

Mar 3,2024 16:36 #Pulse Polio, #tirupathi

ప్రజాశక్తి-నాయుడుపేట (తిరుపతి జిల్లా) : నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పట్టణంలోని అన్ని పోలియో కేంద్రాలను నాయుడుపేట మునిసిపల్ కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి పర్యవేక్షించి దగ్గరుండి చిన్నారులకు టీకాలు వేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సచివాలయాల నందు, అర్బన్ హెల్త్ సెంటర్ నందు ,బస్టాండు తదితర ప్రాంతాలలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కావున ఐదు సంవత్సరాలలోపు పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ పిల్లలను దగ్గర్లోని పోలియో కేంద్రానికి తీసుకువెళ్లి పోలియో చుక్కలు వేయించాలని పట్టణ ప్రజలను కోరారు.

➡️