కాకినాడ శ్రీఆదిత్యలో మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌

నగరంలోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో

మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌లో మాట్లాడుతున్న దిలీప్‌ కుమార్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

నగరంలోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బిబిఎ మేనేజ్‌మెంట్‌ విభాగంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజెమెంట్‌ ఫెస్ట్‌ ‘డిజిమేజ్‌-2024’ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘బిల్డింగ్‌ పిక్సెల్‌’ సంస్థ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ పాల్గొని మాట్టాడారు. ప్రస్తుత ప్రపంచంలో డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎన్నో కొత్త విధానాలను సంతరించు కుంటోందని, ప్రతి సంస్థ డిజిటల్‌ మార్కెటింగ్‌పై ఆధార పడుతున్నారన్నారు. డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, వాటిని విద్యార్థులు వినియోగించు కోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.వి. వేణుగోపాల్‌ మాట్లాడుతూ తమ కళాశాలలో బిబిఎ ప్రోగ్రాంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. బిబిఎ విద్యార్ధులు వివిధ కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలు పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో జె.ప్రభాకరరావు, కళాశాల డైరెక్టర్‌ బిఎస్‌ చక్రవర్తి, వై.దినేష్‌ కుమార్‌, దీపిక, శ్రావణి, మహాలక్ష్మి పాల్గొన్నారు.

 

➡️