మమతా బెనర్జీకి గాయం

Mar 15,2024 00:29 #injured, #Mamata Banerjee

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టిఎంసి నాయకులు మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. మమత తలకు తగిలిన గాయానికి సంబంధించిన ఫొటోలను టిఎంసి తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. మమత కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. మమత ప్రస్తుతం కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వివిధ పార్టీల నాయకులు తెలిపారు. కాగా, జనవరిలోనూ ఒక కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్‌ నుంచి కోల్‌కత్తాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వారుకు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న మమతా బెనర్జీ విండ్‌షీల్డ్‌కు ఢకొీనడంతో తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ మమత కాలికి గాయమయింది. కాలికి కట్టుకునే ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.

➡️