ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వ హించారు. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా నిర్వ హించనున్న నేపథ్యంలో ముందుగా కోయిల్ ఆళ్వార్ నిర్వహిం చడం ఆనవాయితీ. ఉదయం సుప్ర భాతంతో స్వామి వారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. అనంతరం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం ఘనంగా నిర్వహించారు. గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పును నీటితో శుద్ధి చేశారు. 11.30 గంటల తరువాత స్వామి వారి దర్శనాన్ని భక్తులను అనుమతించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ నటేష్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు రాఘవ, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాహన సేవల వివరాలు.. ఈ నెల 16న సాయంత్రం అంకురార్పణ, 17న ఉదయం ధ్వజారోహణం (మీథున లగం) సాయంత్రం శేష వాహనసేవ, 18న ఉదయం వేణుగానాలంకారం, సాయంత్రం హంస వాహన సేవ, 19న ఉదయం వటపత్రశాయి అలంకారం, సాయంత్రం సింహ వాహన సేవ, 20న ఉదయం నవనీత కష్ణాలంకారం, సాయంత్రం హనుమత్సేవ, 21న ఉదయం మోహినీ అలంకారం, సాయంత్రం గరుడసేవ, 22న ఉదయం శివధనుర్భం గాలంకారం, సాయంత్రం కళ్యాణోత్సవం, గజడ వాహన సేవ, 23న ఉదయం రథోత్సవం, 24న ఉదయం కాళీయమర్ధనా లంకారం, సాయంత్రం అశ్వవాహన సేవ, 25న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం. 26న సాయంత్రం పుష్పయాగం కార్యక్రమాలుంటాయి.