ఢిల్లీలో 4.9 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత

Dec 15,2023 14:39 #Delhi, #lowest temperature

న్యూఢిల్లీ :   ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది .శుక్రవారం ఉదయం అత్యంత కనిష్ఠంగా 4.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. లోధిరోడ్‌లో 5 డిగ్రీలు, అయానగర్‌లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యంత కనిష్ఠంగా హర్యానాలోని హిసార్‌లో 4.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఢిల్లీతో పాటు పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, అస్సోం, మేఘాలయ, త్రిపురలో కూడా దట్టంగా మంచు పరుచుకున్నట్లు వెల్లడించింది. ఈ వారమంతా ఇదే వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉదయం ఢిల్లీలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.

➡️