ప్రజాశక్తి-బొబ్బిలి : స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ కేంద్రాన్ని కొనసాగించాలని పట్టణ కళాసీ సంఘం కార్యదర్శి డి.వర్మ, లారీ ఓనర్స్ అసోసియేషన్ అద్యక్షులు ఎన్. వేణుగోపాల్ కోరారు. రైల్వే స్టేషన్ ను గురువారం డివిజనల్ రైల్వే మేనేజర్ సర్వా ప్రసాద్ పరిశీలించారు. రైల్వే స్టాటిన్ ఉన్న వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తే కళాసీ కార్మికులు, లారీ ఓనర్స్, కార్మికులు ఉపాధి కోల్పోతారన్నారు. వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ వలన వందలాది మంది కళాసీలు, లారీ ఓనర్లు, కార్మికులు ఉపాధి పొందుతున్నారని, కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తే వీరంతా ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలిలోనే వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ కేంద్రాన్ని కొనసాగించి ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం ప్లాట్ ఫామ్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయనతో రైల్వే అధికారులు వున్నారు.