మద్యం కేసు..చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

high court on sand mining

ప్రజాశక్తి-అమరావతి : మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తాము తీర్పును వెలువరించేంత వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రేపు ఈ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

➡️