నిడమర్రులో వామపక్ష అభ్యర్థి ప్రచారం

నిడమర్రు (పశ్చిమ గోదావరి) : కాంగ్రెస్‌, సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి జన్నా శివశంకర్‌ను గెలిపించాలని కోరుతూ … శుక్రవారం వామపక్ష నేతలు నిడమర్రులో పర్యటించారు. ముందుగా గ్రామంలోని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌, జగజ్జివన్‌రామ్‌ ల విగ్రహాలకి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేపట్టారు. శివశంకర్‌ మాట్లాడుతూ … సామాజిక న్యాయం అమలు జరగాలి అంటే వామపక్ష అభ్యర్థులు గెలవాలని పిలుపునిచ్చారు.

➡️