9నుంచి ఎల్‌ఇడి ఎక్స్‌పో

Apr 15,2024 20:48 #Business, #led expo

ముంబయి : మే9 నుంచి 11 వరకు ముంబయిలో ఎల్‌ఇడి ఎక్స్‌పో 27వ ఎడిషన్‌ జరగనుంది. కొత్తగా 49 కంపెనీలు సహా మొత్తంగా 185పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇందులో లైటింగ్‌ పరిశ్రమ నిపుణులు సరికొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం పంచుకోనున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల ట్రేడ్‌ ఫెయిర్‌లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు.

➡️