ప్రజాశక్తి – కలిదిండి
ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన స్టేట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే 2024 విధానాన్ని డిఇఒ ఎస్.అబ్రహం తనిఖీ చేశారు. ఎంఇఒ పిడుగు ప్రభాకర బాబుతో కలిసి ఆయన పలు పాఠశాలలను పరిశీలించారు. కలిదిండి, అవకూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులను తెలుగు, గణితం, ఆంగ్లంలలో ఏదైనా రెండు అంశములకు సంబంధించి 90 నిమిషముల పాటు నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థులు వెనుకబడిన అంశాలను, రాబోయే ఏడాదిలో అవలంభించవలసిన విధానపరమైన మార్పులను వివరించారు.